
- పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ
నిజామాబాద్, వెలుగు : ‘భూభారతి’ కోసం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన మెండోరా మండలంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిశీలనకు మంగళవారం రెవెన్యూ ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ ప్రారంభించారు. ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్ ఆధ్వర్యంలో బుస్సాపూర్, దూదిగావ్లో కొనసాగిన విచారణ తీరును కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు పరిశీలించారు. రెండు విలేజ్ల నుంచి వచ్చిన ల్యాండ్ సంబంధ దరఖాస్తులను జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన డెస్క్లో క్షుణ్ణంగా స్టడీ చేసి ఏం చేయాలనే అంశాన్ని నిర్ణయిస్తున్నారు.
అర్జీదారులతో మాట్లాడాక గ్రౌండ్ రియాల్టీ తెలుసుకోవడానికి వెళ్తున్నారు. ఈ విధానం బాగుందని ఇలాగే ముందుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. గవర్నమెంట్ భూభారతి చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించి లోపాలకు తావులేకుండా పరిష్కరించాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీకాంత్, మల్లయ్య, కిరణ్మయి, సంతోష్ తదితరులు ఉన్నారు.