- ప్రభుత్వ సలహాదారు పి .సుదర్శన్ రెడ్డి
బోధన్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. ఆదివారం బోధన్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించారు. బోధన్లోని అంబేద్కర్ కాలనీ, శ్రీనివాసనగర్, రెంజల్ బేస్, గంజ్రోడ్, దేగంకగల్లి, వినాయకనగర్, ఆచన్పల్లి ప్రాంతాల్లో పర్యటించారు. కాంగ్రెస్ పార్టి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధిని చేసుకోవచ్చునని తెలిపారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు , వీధిలైట్లు వంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇచ్చిన హామీలు నేరవేరుస్తుందని తెలిపారు.
తెలంగాణలోని మహిళలకు ఉచితబస్సు , సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే బోధన్ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజురు చేసినట్లు తెలిపారు. విడతల వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మెన్ ఆనంపల్లి ఎలయ్య, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త శరత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, మహిళలు పాల్గొన్నారు.
