బీజేపీ, బీఆర్ఎస్ ఒకే నాణానికి రెండు ముఖాలు : షబ్బీర్అలీ

బీజేపీ, బీఆర్ఎస్  ఒకే నాణానికి  రెండు ముఖాలు :  షబ్బీర్అలీ
  • ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ

కామారెడ్డిటౌన్​, వెలుగు: బీజేపీ బీఆర్​ఎస్​ ఒకే నాణానికి రెండు ముఖాలని  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ విమర్శించారు.    కామారెడ్డి మున్సిపల్​ పరిధిలోని  8,12,31,34, 35, 36,37 వార్డుల్లో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థుల తరపున షబ్బీర్​అలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.   ఆయా వార్డుల్లో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో దోస్తి, గల్లీలో కుస్తీ అన్నట్లుగా  బీజేపీ , బీఆర్ఎస్​  పార్టీలు వ్యవహారిస్తూ ప్రజలను మోసగిస్తున్నాయన్నారు.  

అబద్ధాల బీఆర్​ఎస్​, విభజన బీజేపీలను ప్రజలు తిరస్కరించాలన్నారు.  కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్​ జెండా ఎగురవేయాలన్నారు.    కామారెడ్డి పట్టణ అభివృద్ధి కాంగ్రెస్​ పార్టీతోనే సాధ్యమన్నారు.   మున్సిపాలిటీలో కాంగ్రెస్​ పార్టీని ప్రజలు అదరించాలని మౌలిక వసతులు కల్పించేందుకు  కృషి చేస్తానన్నారు. ఆయా వార్డలు అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.