పతంజలి పాల కంపెనీ సీఈఓ కరోనాతో మృతి

పతంజలి పాల కంపెనీ సీఈఓ కరోనాతో మృతి

కరోనా వైరస్ పతంజలి కంపెనీని కూడా వదల్లేదు. పతంజలి పాల కంపెనీ సీఈఓ సునిల్‌ బన్సల్‌ కరోనాతో మృతి చెందారు. 57 ఏళ్ల ఆయన నెల 19వ తేదీనే చనిపోయారు.

ఊపిరితిత్తుల బాగా దెబ్బతినడంతో పాటు బ్రెయిన్‌ హామరేజీ కారణంగా మృతి చెందినట్లు సునిల్ ఫ్రెండ్స్ తెలిపారు. 2018లో పాల వ్యాపారంలోకి పతంజలి అడుగుపెట్టినపుడు డెయిరీ సైన్స్ లో నిపుణుడైన సునీల్‌ బన్సల్‌ ఆ కంపెనీలో చేరారు. మొదట దగ్గు, జలుబుతో బాధపడిన సునీల్ బన్సల్‌.. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. చివరి రోజులల్లో ECMOపై ఆయనకు చికిత్స అందించినట్లు సునీల్ సన్నిహితులు తెలిపారు. అయితే సునీల్‌ మరణంపై పతంజలీ కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.