కాంగ్రెస్ కు పీసీసీ, సీఎల్పీ రెండు కళ్లలాంటివి

కాంగ్రెస్ కు పీసీసీ, సీఎల్పీ రెండు కళ్లలాంటివి

హైదరాబాద్: కాంగ్రెస్ కు పీసీసీ, సీఎల్పీ రెండు కళ్లలాంటివన్నారు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి. మంగళవారం హైదరాబాద్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో సమావేశమైన ఆయన... రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు ఎంత ముఖ్యమో.. సీఎల్పీ నేత కూడా అంతే ముఖ్యమన్నారు మల్లు రవి. భట్టి విక్రమార్క తన తమ్ముడని, సోనియా గాంధీ నిర్ణయం మేరకు పనిచేయాలని సూచించినట్టు చెప్పారు. శ్రీధర్ బాబుకు పీసీసీ ఇవ్వాలని భట్టి కోరారని, అయితే అధిష్టానం రేవంత్ వైపు నిలిచిందన్నారు. సాయంత్రం రేవంత్ కూడా భట్టిని కలుస్తారని చెప్పారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని, కేసీఆర్ ను గద్దె దించడానికి అందరూ కలిసి పనిచేయాలని తెలిపారు. మరోవైపు మల్లు రవి ఉండగానే భట్టి ఇంటికి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రేం సాగర్ రావు, NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ వచ్చారు. ముగ్గురు కలిసి పార్టీ పరిస్థితులపై చర్చించారు. అయితే రేవంత్ ప్రమాణ స్వీకారానికి అందరూ హాజరవుతారని మల్లు రవి అంటున్నారు.