పీయూ పీజీ 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

 పీయూ పీజీ 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పీజీ థర్డ్ సెమిస్టర్, ఎంబీఏ, ఎంసీఏ, పరీక్ష ఫలితాలను మంగళవారం పీయూలోని పరిపాలన భవన్ లో  వీసీ శ్రీనివాస్, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్  చంద్రకిరణ్, పరీక్షల నియంత్రణ అధికారి ప్రవీణతో కలసి విడుదల చేశారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షల్లో 84.83 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు.  ఫలితాలను అధికారిక వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో చూసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే త్వరలో  రీ కౌంటింగ్ కి నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జామినేషన్స్ కో ఆర్డినేటర్స్ డా.అరుంధతి, డా.రవీందర్ రెడ్డి  పాల్గొన్నారు.