ఐదు తరగతులకు ఒకే ఒక్కడు

ఐదు తరగతులకు ఒకే ఒక్కడు

ఇది మహబూబ్​నగర్​జిల్లా మహమ్మదాబాద్ మండలం రాగార్పల్లిలోని ఏకోపాధ్యాయ స్కూల్. ఇక్కడ ఐదు తరగతులుండగా రాఘవేందర్​ అనే ఒకే ఒక్క స్టూడెంట్ ఐదో తరగతి చదువుతున్నాడు. ఇతడి కోసం ప్రత్యేకంగా శకుంతల అనే టీచర్​పాఠాలు చెప్తోంది.

ఆమె మాట్లాడుతూ గత ఏడాది ఇద్దరు స్టూడెంట్లు ఉండేవారని, అందులో ఒకరు ఈ ఏడాది టీసీ తీసుకెళ్లాడని చెప్పారు. ఒకే స్టూడెంట్ వస్తుండడంతో అతడికి కూడా పాఠాలు చెప్తున్నామన్నారు.ఈ  గ్రామంలో 25 కుటుంబాలుండగా, 9 మంది సమీపంలోని ప్రైవేట్​ స్కూల్​కు వెళ్తున్నారు.  
- గండీడ్, వెలుగు