వేములవాడలో మరో 5 కోడెలు మృతి

వేములవాడలో మరో 5 కోడెలు మృతి
  • గుట్టుచప్పుడు కాకుండా పూడ్చడానికి యత్నించిన సిబ్బంది
  • అడ్డుకున్న రైతులు
  • 32 జతల కోడె పిల్లలు పంపిణీ చేసిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రాజన్న సిరిసిల్ల, వెలుగు : వేములవాడ రాజన్న గోశాలలో కోడెల మృత్యుఘోష ఆగడం లేదు. గత వారం రోజుల్లో 30 కోడెలు చనిపోగా.. ఆదివారం తెల్లవారుజామున మరో ఐదు కోడెలు మృత్యువాత పడ్డాయి. చనిపోయిన కోడెలను గుట్టుచప్పుడు కాకుండా మూలవాగులో ఖననం చేసేందుకు గోశాల నిర్వాహకులు యత్నించారు. గమనించిన కొందరు రైతులు వారిని అడ్డుకున్నారు. 

మూలవాగులో కోడెలను ఖననం చేయడం వల్ల తీవ్ర దుర్వాసన వస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సిబ్బంది కోడెలను మరో చోట ఖననం చేశారు. అయితే గోశాలలో కెపాసిటీకి మించి కోడెలు ఉండడం వల్ల తొక్కిసలాట జరగడంతో పాటు అనారోగ్యంతో కోడెలు చనిపోతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా కోడెలకు సరైన సమయంలో, సరైన ఆహారం అందడం లేదని అందుకే కోడెలు చనిపోతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కోడెల పంపిణీ

రాజన్న గోశాలలో ఉన్న 32 జతల కోడె పిల్లలను ఆదివారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝూ రైతులకు పంపిణీ చేశారు. కోడె పిల్లలను తీసుకున్న రైతులు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. గోశాల ఆవరణలో గుంతలను పూడ్చివేస్తున్నామని, కోడెలకు మెరుగైన దాణ, పశుగ్రాసం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. వెటర్నరీ డాక్టర్లతో సంప్రదిస్తూ కోడెలకు ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందిస్తున్నామన్నారు.