ధోనీ రికార్డును సమం చేసిన రవీంద్ర జడేజా

ధోనీ రికార్డును సమం చేసిన రవీంద్ర జడేజా

చిదంబరం స్టేడియం వేదికగా ఏప్రిల్ 08వ తేదీన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.  ఈ  మ్యాచ్ లో చెన్నై  మాజీ కెప్టెన్ ధోనీ పేరిట ఉన్న ఓ రికార్డును ఆ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సమం చేశాడు. అదేంటంటే అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన సీఎస్ కే  ప్లేయర్‌గా నిలిచాడు. ధోనీ, జడేజా ఇప్పటివరకు 15 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ గెలవగా, ఆ తర్వాతి స్థానాల్లో సురేశ్ రైనా (12), రుతురాజ్ గైక్వాడ్ (10), హస్సీ (10) ఉన్నారు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా బంతితో నిప్పులు చెరిగాడు.  నాలుగు ఓవర్లలో 18 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.  అంతేకాకుండా రెండు కీలకమైన క్యాచ్ లు పట్టుకున్నాడు.  దీంతో ఐపీఎల్‌లో 100 క్యాచులు పట్టిన ఆటగాళ్ల లిస్ట్‌లో చేరారు. దీంతో ముంబై ప్లేయర్ రోహిత్ శర్మతో కలిసి జడేజా ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ లిస్ట్‌లో కోహ్లీ(110), రైనా(109), పొలార్డ్(103) ముందు వరసలో ఉన్నారు.