శ్రీశైలంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం

శ్రీశైలంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం

శ్రీశైల మహాక్షేత్రంలో ఈరోజు నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం కానున్నాయి. గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన, ఆర్జిత సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం పునఃప్రారంభం కానుంది. కరెంట్, ఆన్ లైన్ బుకింగ్ ద్వారా ఆర్జిత సేవల టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 6 నుంచి రోజుకు మూడుసార్లు సామూహిక అభిషేకాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు . ఫిబ్రవరి 22న మొదలైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగియనున్నాయి. రాత్రి 10 గంటలకు స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం, శయణోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.