IPL 2025 Final: మూడేళ్లకే చరిత్ర: జట్టులోకి వస్తే నవ్వుకున్నారు.. ఇప్పుడు 18 ఏళ్ళ కరువు తీర్చాడు

IPL 2025 Final: మూడేళ్లకే చరిత్ర: జట్టులోకి వస్తే నవ్వుకున్నారు.. ఇప్పుడు 18 ఏళ్ళ కరువు తీర్చాడు

2025 ఐపీఎల్ 2025 టైటిల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకుంది. మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్‌ వేదికగా  పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది.17 ఏళ్లుగా ఎదురు చూసిన ట్రోఫీ 18వ ప్రయత్నంలో సాధించి తమ కప్ కళను నెరవేర్చుకున్నారు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ప్రయత్నంలోనే జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించిన అరుదైన లిస్ట్ లో పటిదార్ చేరిపోయాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ, షేన్ వార్న్, గిల్క్రిస్ట్, హార్దిక్ పాండ్య తర్వాత ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.

పటిదార్ ఐపీఎల్ ప్రస్థానం ఇది.. 

ఐపీఎల్ 2021 లో రజత్ పటిదార్ తొలిసారి ఐపీఎల్ 2021 సీజన్ లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రారంభంలో తుది జట్టులో జట్టులో కనీసం చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే 2021లో జట్టు ఘోరంగా విఫలం కావడంతో పటిదార్ కు తొలి ఛాన్స్ దక్కింది. ఈ సీజన్ లో ఓవరాల్ గా నాలుగు మ్యాచ్ లే ఆడినా ఈ ఆర్సీబీ కెప్టెన్.. కేవలం 71 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో పటిదార్ కెరీర్ ముగిసిందనుకున్నారు. 2022 మెగా ఆక్షన్ ముందు పటిదార్ ను ఆర్సీబీ అసలు పట్టించుకోలేదు. కనీసం ఏ జట్టు కూడా కొనలేదు. 

పటిదార్ కు వేరే ప్లేయర్ గాయం వలన అదృష్టం కలిసి వచ్చింది. లునివిత్ సిసోడాయాకి గాయం కావడంతో అతనికి రీప్లేస్ మెంట్ గా మరోసారి జట్టులోకి చేరాడు. ఇక్కడ నుంచి పటిదార్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సీజన్ లో వచ్చిన అవకాశాలను రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. కేవలం 8 మ్యాచ్ ల్లోనే 333 పరుగులు చేసి దుమ్మురేపాడు. వీటిలో ఒక సెంచరీ కూడా ఉంది. అప్పటినుంచి ఆర్సీబీ జట్టులో రెగ్యులర్ ప్లేయర్ గా మారాడు. 2023 లో గాయం కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. 

Also Read : ఈ సాలా కప్ నమ్దు'.. ట్రోఫీ తీసుకునే ముందు డైలాగ్ చెప్పి ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చిన పటిదార్

2024 ఐపీఎల్ లో 395 పరుగులు నిలకడగా రాణించాడు. పటిదార్ మరోవైపు దేశవాళీ క్రికెట్ లో కూడా అదరగొట్టడంతో అతన్ని 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ రూ. 11 కోట్లకు రిటైన్ చేసుకొని ఏకంగా కెప్టెన్సీ ఇచ్చింది. తొలిసారి కెప్టెన్ అయినా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆర్సీబీని విజయవంతంగా ముందుకు నడిపించాడు. మూడేళ్ళ క్రితం రీప్లేస్ మెంట్ గా వచ్చిన ఒక ప్లేయర్ ఆర్సీబీ 18 ఏళ్ళ కలను నిజం చేసి చరిత్ర సృష్టించాడు. 

ఫైనల్లో 16 బంతుల్లోనే 2 సిక్సర్లు.. ఒక ఫోర్ తో 26 పరుగుకు చేసి జట్టుకు కీలకమైన పరుగులు అందించాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్‌ వేదికగా  పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. 17 ఏళ్లుగా ఎదురు చూసిన ట్రోఫీ 18వ ప్రయత్నంలో సాధించి తమ కప్ కళను నెరవేర్చుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ 7 వికెట్లకు 184 పరుగులకు పరిమితమైంది.