హైదరాబాద్, వెలుగు: కాచిగూడలోని ఓ అపార్ట్మెంట్ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్యాప్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్నిర్వహిస్తున్న ముగ్గురిని వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.25లక్షల క్యాష్, ల్యాప్టాప్,11ల్యాండ్ లైన్ ఫోన్స్,11 సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్కి చెందిన నీరజ్ జైన్(45) బట్టల వ్యాపారి. రాజేంద్రనగర్ ఏరియాలో బెట్టింగ్ నిర్వహిస్తూ రెండు సార్లు పోలీసులకు చిక్కాడు. కాచిగూడ చప్పల్ బజార్కి చెందిన అమిత్ సర్ధ(41) క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో నిందితుడు. వీరిద్దరూ పురానాపూల్లోని కబూతర్ఖానాకు చెందిన నారాయణ్దాస్(37)తో కలిసి కాచిగూడలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటూ ఐపీఎల్ మ్యాచ్లపై క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సోమవారం జరిగిన విమెన్ టీ–20 మ్యాచ్పై బెట్టింగ్ నిర్వహిస్తుండగా సమాచారం అందుకున్న వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు కాచిగూడ పోలీసులతో కలిసి దాడులుచేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు
తరలించారు.