కీచక ప్రిన్సిపల్​.. పదో తరగతి విద్యార్థులతో అసభ్యంగా

కీచక ప్రిన్సిపల్​.. పదో తరగతి విద్యార్థులతో  అసభ్యంగా

హకీంపేటలో స్పోర్ట్స్​ ఓఎస్​డీ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మరవక ముందే రంగారెడ్డి జిల్లాలో మరో టీచర్​ ఉదంతం బయటపడింది. 

విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్​దేవ్​పల్లి పోలీస్​స్టేషన్​పరిధిలోని కాటేదాన్​ రాకేష్​ విద్యా నికేతన్​ స్కూల్​ప్రిన్సిపల్​ శంకర్​పదో తరగతి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పేరెంట్స్​ ఆరోపించారు. 

ఇదే విషయంపై ప్రిన్సిపల్​ని నిలదీయగా అతను స్పందించలేదు. ఆయన ప్రవర్తనతో విసుగెత్తిన పేరెంట్స్ షీ టీం కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.