జూన్ 16న రైతులతో సీఎం రేవంత్‌‌ ముఖాముఖి

జూన్  16న రైతులతో సీఎం రేవంత్‌‌ ముఖాముఖి
  • 1,500 రైతు నేస్తం కేంద్రాల్లో
  • ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు: సీఎస్‌‌

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 16న రాజేంద్రనగర్‌‌‌‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో జరగనున్న రైతు నేస్తం కార్యక్రమానికి సీఎం రేవంత్‌‌ రెడ్డి హాజరై, రైతులతో ముఖాముఖి మాట్లాడుతారని సీఎస్ రామకృష్ణా రావు చెప్పారు. అన్ని రైతు నేస్తం కేం ద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని, ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో సీఎస్​ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రతి ప్రాంతం నుంచి కనీసం 250 మంది రైతులు హాజరయ్యేలా చూసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇప్పటివరకు 500 కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వీడియో కాన్ఫరె న్స్ సదుపాయాన్ని విస్తరించి, ఈ నెల 16 నుంచి అద నంగా మరో 1,000 కేంద్రాల్లో అందుబాటులోకి తీసు కురానున్నట్లు తెలిపారు. 

ఈ సదుపాయం ద్వారా రైతులు ఏ పంటలు వేసుకోవాలి, ఆధునిక సాగు విధానాలపై నిపుణులు తరుచూ సూచనలు ఇస్తారని సీఎస్ చెప్పారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం కోసం ప్రతి రైతు నేస్తం కేంద్రంలో సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారితో పాటు మండల స్థాయి అధికారిని నియమించాలని కలెక్టర్లను కోరారు.