సముద్ర స్నానానికి వెళ్లి నలుగురు.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

సముద్ర స్నానానికి వెళ్లి నలుగురు.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి
  • ఒకేరోజు వేర్వేరు చోట్ల ఈతకు వెళ్లి ఏడుగురి మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఏడుగురు యువకులు మృతి చెందిన ఘటనలు ఆదివారం చోటు చేసుకున్నాయి. ఒడిశా సరిహద్దును ఆనుకుని ఉన్న శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పుక్కళ్లపల్లెలో ఆదివారం సెలవుదినం కావడంతో సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా పోలీసులు స్పీడు బోట్ల సహాయంతో గాలింపు చేపట్టగా ఇద్దరి మృతదేహాలు దొరికాయి. మృతులు బొర్రపుట్టుగ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సముద్రంలో గల్లంతైన మరో ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. 
కృష్ణా జిల్లాలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రం కృష్ణా జిల్లా పెదపులిపాకలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. కృష్ణా నదిలో సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీటమునిగి మరణించారు. చనిపోయన యువకులు శ్రీనివాస్ (25), గోవింద్ (25), సతీష్ (22) గా గుర్తించారు.