TSPSC: రెండో రోజు నిందితులను విచారిస్తున్న సిట్

TSPSC:  రెండో రోజు నిందితులను  విచారిస్తున్న సిట్

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితుల రెండో రోజు విచారణ కొనసాగుతోంది. 9 మంది నిందితులను పోలీసులు ప్రశ్నిస్తోంది. నిందితుల లావాదేవీలపై  కూపీ లాగుతోంది..   ప్రశ్నాపత్రం ఎవరెవరకి ఇచ్చారనేదానిపై ఆరాదీస్తున్నారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏడు పేపర్స్ లీకైనట్లు గుర్తించిన సిట్ వాటి వివరాలను సేకరిస్తోంది. అక్టోబర్ నుంచి టాప్ మార్కులు తెచ్చుకున్న వారి వివరాలను కనుక్కుంటోంది. మార్చి 23 వరకు నిందితులు కస్టడీలోనే ఉండనున్నారు.

 మార్చి18న ప్రవీణ్,రాజశేఖర్ ల చేత టీఎస్ పీఎస్సీలో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు సిట్ అధికారులు. రెండు సిస్టంలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితులను సిట్ ఆఫీస్ లో విచారించారు.