రాజ్యాంగాన్ని పక్కదారి పట్టిస్తున్నరు

రాజ్యాంగాన్ని పక్కదారి పట్టిస్తున్నరు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్ట్స్ లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడిన సోనియా.. మోడీ సర్కార్ తీరుపై మండిపడ్డారు. గంగా జమున సంస్కృతిని రూపుమాపే కుట్ర జరుగుతోందన్నారు. దేశంలో సాధారణ పౌరుడు అభద్రతా భావంలో ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పక్కదారి పట్టిస్తున్నారని..ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మౌనంగా ఉండబోదన్నారు సోనియా. ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ ప్రయాణం  ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదర్శాలు, విలువలు, సూత్రాలకు.. మరోసారి తమల్ని తాము పునరంకితం చేసుకుంటామన్నారు సోనియా.