ఓరుగల్లు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంగ్లా.. ఇక హెరిటేజ్ భవన్

ఓరుగల్లు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంగ్లా.. ఇక హెరిటేజ్ భవన్
  • 1886 ఆగస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిజాం అసఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జాహీల పాలనలో నిర్మాణం
  • 13 ఎకరాల్లో విశాలమైన హాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 22 గదులతో బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • స్వాతంత్ర్యానికి పూర్వం సుబేదార్లు, అనంతరం కలెక్టర్లకు నివాసం
  • రూ. 2 కోట్లతో రిపేర్లు.. పాత తరహాలో డంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సున్నంతోనే పనులు

వరంగల్‍, వెలుగు : కాకతీయుల రాజధాని ఓరుగల్లులో 1886లో బ్రిటీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిజాం హయాంలో కట్టిన సుబేదారి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంగ్లా హెరిటేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారబోతోంది. 139 ఏండ్ల కింద కట్టినా ఇప్పటివరకూ చెక్కుచెదరకపోవడంతో ఈ భవనాన్ని వారసత్వ సంపదగా భావితరాలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అక్కడక్కడగా చిన్నపాటి రిపేర్లు చేసేందుకు రూ. 2 కోట్లను మంజూరు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన రిపేర్లు నేటితో ముగియనున్నాయి.

వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంగ్లా కేంద్రంగా సుబేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలన

ఖులీ కుతుబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాహీల పాలన తర్వాత దక్కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతాన్ని అసఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జాహీలు చేజిక్కించుకున్నారు. వీరి పాలన సుమారు ఒకటిన్నర శతాబ్దానికిపైగా సాగింది. అసఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జాహీలు పాలనాసౌలభ్యం కోసం రాజ్యాన్ని సుభాలుగా విభజించారు. ఒక్కో సుభాకు తరఫ్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదంటే సుబేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాయి అధికారి ఉండేవారు. సుబేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ‘సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లష్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అని కూడా పిలిచేవారు. తానీషా కాలంలో గోల్కొండ రాజ్యం ఆరు సుభాలుగా ఉండేది. అందులో వరంగల్ ఒకటి. ఈ సుభాలో ఎలగందుల (కరీంనగర్), స్తంభగిరి (ఖమ్మం), దేవరకొండ (నల్గొండ), వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్లు ఉండేవి.

వీటన్నింటికీ ఓరుగల్లు కేంద్రంగా ఉండేది. 1853లో సాలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిజాం రాజ్యాన్ని ఐదు సుభాలుగా.. 17 జిల్లాలుగా, ప్రతి జిల్లాను కొన్ని తాలుకాలుగా విభజించాడు. 1875లో వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భూసర్వే శాఖను స్థాపించారు. ఈ క్రమంలోనే 1886 ఆగస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10న అప్పటి బ్రిటీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారి జార్జ్ పాల్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భార్య బంగ్లా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దీనిని సుబేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నివాసంగా ఉపయోగించారు. దీని వల్లే హనుమకొండలోని ఈ ఏరియాకు ‘సుబేదారి’ అనే పేరు వచ్చింది.

రాజసం ఉట్టిపడేలా నిర్మాణం

హనుమకొండ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆనుకుని ఉండే ఈ బంగ్లాను 13 ఎకరాల్లో, అడుగడుగునా రాజసం ఉట్టిపడేలా నిర్మించారు. వరదలు, ఉపద్రవాలు వచ్చినా.. చెక్కుచెదరకుండా డంగు సున్నంతో కట్టారు. బంగ్లా ప్రవేశద్వారంగా భారీ స్థాయిలో కమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, దానికి ఇరువైపులా కాపలా సిబ్బంది గదులను నిర్మించారు. కమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పెద్ద గడియారాన్ని సైతం ఏర్పాటు చేశారు. విశాలమైన ప్రాంగణంలో పూలు, పండ్ల మొక్కలతో పాటు శ్రీ గంధం, నల్లతుమ్మ, రాగి, వేప, అల్లనేరేడు వంటి వందల రకాల చెట్లు ఉన్నాయి. 

బంగ్లా లోపల గాలి, వెలుతురు ప్రసరించేలా 22 గదులను నిర్మించారు. బంగ్లా మొదట్లో అతిథులు కూర్చోవడానికి వీలుగా 44 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో విశాలమైన హాలు కట్టారు. 22 ఫీట్ల ఎత్తులో స్లాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణం చేపట్టారు. అప్పట్లో రాచరికానికి గుర్తుగా ఏర్పాటు చేసిన శాండ్లియర్లు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రధాన హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎడమ వైపున 8, కుడి వైపు మరో 7 గదులున్నాయి. ఈ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ బాత్రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 13 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుతో ఉండడం గమనార్హం. చెక్కలతో ఏర్పాటు చేసిన మెట్ల ద్వారా మొదటి అంతస్తుకు వెళ్తే... విశాలమైన టెర్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పెద్ద హాల్‍, మరో 3 గదులున్నాయి. ఇక్కడి నుంచి చూస్తే చుట్టూరా ఉన్న ఏరియాలు కనిపిస్తాయి. ఉమ్మడి వరంగల్‍ కేంద్రంగా ప్రస్తుతం ఎన్నో బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు, విల్లాలు వచ్చినా ఈ బంగ్లా హంగు, ఆర్భాటం ఏమాత్రం తగ్గలేదు.

43 మంది కలెక్టర్లకు నివాసం

అసఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాహీల కాలంలో నిర్మించిన ఈ భవనంలో 1948 సెప్టెంబర్‍ 17 వరకు సుబేదార్లు నివాసం ఉండేవారు. 1950 నుంచి ప్రభుత్వ అధికార భవనంగా మార్చి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నివాసంగా వినియోగిస్తున్నారు. 1950లో వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదటి కలెక్టర్ ఎంవీ.రాజ్వేద నుంచి మొదలుకొని ప్రస్తుత కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రావీణ్య వరకు మొత్తం 43 మంది కలెక్టర్లు, మరికొందరు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కలెక్టర్లు ఈ బంగ్లాను నివాసంగా ఉపయోగించారు. 1982లో జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న టైంలో ఈ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంగణంలోని బావి పూడికతీత చేపట్టగా.. నిజాం కాలం నాటి కత్తులు, ఇతర సామగ్రి లభించాయి. వాటిని పురావస్తు శాఖకు అప్పగించారు. ఈ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హెరిటేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చేందుకు నిర్ణయించడంతో ప్రస్తుత కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రావీణ్య జనవరిలో ఖాళీ చేసి కొత్త బిల్గింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లిపోయారు. 

రూ. 2 కోట్లతో రిపేర్లు

సుమారు 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లాను వారసత్వ సంపదగా గుర్తించిన నేపథ్యంలో అక్కడక్కడా దెబ్బతిన్న కట్టడాలను పునరుద్ధరిస్తున్నారు. కాకతీయ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‍మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథారిటీ ఆధ్వర్యంలో రూ. 2 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ నిధులతో దెబ్బతిన్న గోడలు, స్లాబ్‍ ఫ్లోరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సున్నంతో రిపేర్లు చేశారు. తెల్లటి పెయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయడంతో పాటు లైటింగ్‍ ఏర్పాటు చేశారు. టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రీ, రాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూకోఫెల్లం, లాంటానా, స్పైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిల్లీ, వడేలియా రుబ్రా వంటి మొక్కలతో గార్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీర్చిదిద్దారు. రిపేర్లు సోమవారంతో ముగియనున్నాయి. లైబ్రరీ, ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టుల ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణతో త్వరలోనే పర్యాటకులను అనుమతించనున్నారు.