‘ఐస్క్రీమ్ బండ్లకు మా ఊరిలోకి ప్రవేశం లేదు’ : వేంపల్లి గ్రామ పంచాయతీ నిర్ణయం

‘ఐస్క్రీమ్ బండ్లకు మా ఊరిలోకి ప్రవేశం లేదు’ : వేంపల్లి గ్రామ పంచాయతీ నిర్ణయం
  • ముప్కాల్ మండలం వేంపల్లిలో తీర్మానం 

బాల్కొండ, వెలుగు: ‘పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మా గ్రామంలోకి ఐస్​క్రీమ్ బండ్లకు ప్రవేశం లేదు’ అంటూ నిజామాబాద్​జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకుంది. 

ఐస్​క్రీమ్ ఆటోలు, బండ్లకు ప్రవేశం లేదని.. నిబంధనలు అతిక్రమించి అమ్మితే రూ.5 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. కాగా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.