- నిజామాబాద్ జిల్లా అంబం గ్రామంలో ఘటన
బోధన్, వెలుగు : కల్లులో మద్యం కలుపుకొని తాగడంతో ఓ వ్యక్తి చనిపోగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం(వై) గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నీరడి విఠల్ (45), జుడగలి లక్ష్మయ్య వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఇద్దరూ కలిసి బోధన్, నిజామాబాద్ ప్రధాన రహదారి నర్సాపూర్గేటు వద్ద ఉన్న కల్లు దుకాణానికి వెళ్లారు.
అక్కడ కల్లును తీసుకొని అందులో మద్యం కలుపుకొని తాగారు. కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై విఠల్అక్కడికక్కడే చనిపోగా, లక్ష్మయ్య అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు లక్ష్మయ్యను 108లో బోధన్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. లక్ష్మయ్య పరిస్థితి విషమంగా ఉందని
తెలుస్తోంది.
