- ముగ్గురిపై కేసు, ఒకరు అరెస్ట్
నిజామాబాద్, వెలుగు: స్కానింగ్ సెంటర్ మేనేజ్మెంట్ను ఆరేండ్లుగా మోసం చేసి రూ.70 లక్షలు కాజేసిన ఇద్దరు ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని శాన్వీ స్కానింగ్ సెంటర్లో సూపర్వైజర్గాగుండారం సత్యనారాయణ, ఉద్యోగిగా మీనా పని చేస్తున్నారు. వారికి కీలకమైన బిల్స్ సెక్షన్ బాధ్యతను అప్పగించారు. అయితే స్కానింగ్ కోసం వచ్చే వారి నుంచి తీసుకున్న ఫీజుకు ఒరిజినల్ బిల్ ఇచ్చి కార్బన్ పేపర్ సాయంతో మేనేజ్మెంట్ రికార్డుల్లో తక్కువ అమౌంట్ నమోదు చేసేవారు.
ఇలా ఆరేండ్ల నుంచి రూ.70 లక్షల వరకు నొక్కేశారు. విషయాన్ని గుర్తించిన మేనేజ్మెంట్ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి గుండారం సత్యనారాయణను అరెస్ట్ చేశారు. ఈ డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు నిర్ధారణ కావడంతో.. సత్యనారాయణతో పాటు అతని భార్యపై కూడా కేసు నమోదుచేశామని ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు.
