
- ఈ వారంలోనే నిర్వహించేందుకు ప్రభుత్వ నిర్ణయం
- ఎంసీహెచ్ఆర్డీలో దశలవారీగా 3 రోజుల పాటు శిక్షణ
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు వచ్చిన కొత్త లెక్చరర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని ఇంటర్మీడియెట్ కమిషనరేట్ అధికారులు నిర్ణయించారు. టీజీపీఎస్సీ ద్వారా నియమితులైన 1,200 మందికి 3 రోజులు ట్రైనింగ్ అందించేలా షెడ్యూల్ రెడీ చేస్తున్నారు.
హైదరాబాద్ లోని ఎంసీహెచ్ఆర్డీలో ఈ ట్రైనింగ్ అందించనున్నారు. ఈ వారంలోనే ట్రైనింగ్ ప్రారంభించాలని అధికారులు డిసైడ్ అయ్యారు. 1,200 మందికి ఒకేసారి కాకుండా దశలవారీగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అకడమిక్ తో పాటు అడ్మినిస్ట్రేషన్ అంశాలపై వారికి అవగాహన కల్పించనున్నారు. జూనియర్ లెక్చరర్లు అంతా పీజీ క్వాలిఫికేషన్తో వచ్చిన వారే కావడంతో లెస్సన్ ప్లానింగ్, బోధనా పద్ధతులు, కమ్యూనికేషన్ తదితర అంశాలపై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. దీంతో పాటు అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా రికార్డుల నిర్వహణ, సర్వీస్ రూల్స్ వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించనున్నారు.