తెలంగాణలో 11 మంది IASల బదిలీ

తెలంగాణలో 11 మంది IASల బదిలీ

తెలంగాణలో చాలా రోజుల నుంచి ఒకే చోట పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ లను బదిలీ చేసింది రాష్ట్రప్రభుత్వం. వారి వారికి శాఖలను మారుస్తూ బదిలీ  చేశారు. వాణిజ పన్నుల శాఖ కమిషనర్ గా శ్రీదేవి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా కర్ణన్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ స్పెషల్ చీఫ్  సెక్రటరీగా అర్వింద్ కుమార్, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీ గా సుదర్శన్ రెడ్డిని నియమించారు. 

హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీ ఉన్న దాన కిషోర్ ను మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణిప్రసాద్,చ జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా వెంకటేశం, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా శ్రీనివాస రాజు,మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ,హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్టుమెంట్ కార్యదర్శిగా  క్రిస్టియానాను నియమిస్తూ సీఎస్ శాంతికుమారి  ఉత్తర్వులు జారీ చేశారు.