హైదరాబాద్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 28న జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలు హాజరు కావాలని ఇప్పటికే సమాచారం ఇచ్చారు.
ఈ సమావేశంలో ఈనెల 29న సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. పార్టీ తరపున పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాన్ని కేసీఆర్ ఖరారు చేసి ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటామన్న ప్రభుత్వం కేంద్రం అవలంభిస్తున్న వైఖరిపై చర్చించి స్పష్టత ఇచ్చే అవకాశం.