తెలంగాణలో మరో 3 ఒమిక్రాన్ కేసులు 

తెలంగాణలో మరో 3 ఒమిక్రాన్ కేసులు 
  • తెలంగాణలో 44కు చేరిన ఒమిక్రాన్ కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ మరో మూడు కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో రెండు కేసులు జీనోమ్ టెస్టుల కోసం పంపారు. ఫలితాలు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 44కు చేరింది. 
అట్ రిస్క్ దేశాల నుంచి 248 మంది రాగా.. ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేయగా మూడు కేసులు బయటపడ్డాయి. మరో రెండు కేసుల్లో పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

 

ఇవి కూడా చదవండి:

విద్యారంగంపై కరోనా తీవ్ర  ప్రభావం 

కేంద్రం ధాన్యం కొనకపోతే ఇండియా గేట్ వద్ద పోస్తాం

పిల్లలకు వ్యాక్సిన్ మంచిదే కానీ ఎప్పట్లో ఇస్తారు ?