ఢాకా ఇస్కాన్ టెంపుల్ పై దుండగల దాడి

ఢాకా ఇస్కాన్ టెంపుల్ పై దుండగల దాడి

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇస్కాన్ టెంపుల్ పై దుండగులు దాడి చేసి కూల్చివేశారు. ఢాకాలోని లాల్ మోహన్ సాహా వీధిలో ఉన్న రాధాకాంత దేవాలయంపై సుమారు 200 మందికిపైగా దాడి చేసి ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆలయాన్ని లూటీ చేశారు. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన కొందరికి గాయాలయ్యాయి. హాజీ షఫీవుల్లా నేతృత్వంలో ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. ఇస్కాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్ ఈ దాడిని ఖండించారు. భారతీయులకు ఇష్టమైన హోలీ పండుగ రోజు ఈ దాడి జరగడం బాధాకరమన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

2022లో మొదటి తుపాన్‌‌‌‌‌‌‌‌ అసానీ

అస్సాం చాయ్ పత్తాకు జెలెన్ స్కీ పేరు