
భద్రాచలం,వెలుగు: గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లగా బాలుడు చనిపోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. హైదరాబాద్లోని రామంతపూర్కు చెందిన స్వప్న తన పిల్లలు, బంధువులతో కలిసి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దర్శనం కోసం వెళ్లారు.
గోదావరిలో స్నానం చేసేందుకు దిగారు. స్వప్న కొడుకు అఖిల్(8) కూడా నీళ్లలోకి దిగగా ప్రవాహానికి కొట్టుకుపోయాడు. గజ ఈతగాళ్లు అఖిల్ను వెతికి బయటకు తీసుకురాగా అప్పటికే చనిపోయాడు. దర్శనం కోసం వస్తే గంగమ్మ ‘ నా బిడ్డను బలితీసుకుందం టూ’ స్వప్న రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేశారు.