- ఆంధ్రా పార్టీలకు తెలంగాణలో పనేంటి?
- టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ
జీడిమెట్ల, వెలుగు: తెలంగాణ అస్థిత్వాన్ని, సంస్కృతిని కాపాడుకోవడానికి జర్నలిస్టులు సిద్ధంగా ఉండాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు, ప్రెస్అకాడమీ మాజీ చైర్మన్అల్లం నారాయణ సూచించారు. సూరారంలో శుక్రవారం నిర్వహించిన సంఘం కుత్బుల్లాపూర్ నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాటి తెలంగాణ జాయింట్ఫోర్స్(టీజేఎఫ్) ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చూపించాల్సిన అవసరం వచ్చిందన్నారు. తెలంగాణలో ఆంధ్రా పార్టీలకు పనేంటని ప్రశ్నించారు.
మళ్లీ అక్కడి సంస్కృతిని ఇక్కడ రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు ఐక్యంగా ఉండి, కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. అనంతరం తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్యూనియన్ కుత్బుల్లాపూర్కన్వీనర్గా ఎర్రోళ్ల కృష్ణ, కోకన్వీనర్గా ఉదయ్కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్, ఎర్రోళ్ల బాబు తదితరులు పాల్గొన్నారు.
