రష్యాపై డ్రోన్లు విరుచుకుపడ్డాయి. పొస్కోవ్ నగరంలో ఎయిర్పోర్టుపై ఆగస్టు 30వ తేదీ తెల్లవారుజామున డ్రోన్లు దాడి చేశాయి. ఈ దాడిలో నాలుగు రవాణా విమానాలు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని స్థానిక గవర్నర్ మిఖాయిల్ వెడెర్నికోవ్ ధ్రువీకరించారు.
డ్రోన్ల దాడికి రష్యా ఆర్మీ కూడా ప్రతిదాడి చేసింది. తమ డ్రోన్లతో ఎదురుదాడికి దిగింది. డ్రోన్ల దాడితో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడిలో నాలుగు ఇల్యూషిన్-76 విమానాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదు.
మరోవైపు పోస్కోవ్ నగరం ఉక్రెయిన్ సరిహద్దుకు 600 కి.మీల దూరంలో ఉంది. దీంతో ఈ దాడి ఉక్రెయిన్ చేసినట్లు రష్యా అనుమానిస్తోంది. మరోవైపు డ్రోన్ల దాడి ఘటనపై ఉక్రెయిన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.