కజలాంగ్: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు జానపద సంప్రదాయ సంగీతానికి మైమరచిపోయారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ఉత్తరాది ప్రాంతంలో గురువారం పర్యటన సందర్భంగా జానపద సంగీతాలకు స్థానికుల ఆడిపాడుతుంటే.. నేను సైతం అంటూ ఆయన కూడా డ్యాన్సు చేశారు. తొలుత కజలాంగ్ గ్రామంలో కేంద్ర విద్యాలయ పనుల పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల నుంచి ఘనస్వాగతం అందుకున్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సజోలాంగ్ ప్రజలతో కలసి ఆడి పాడారు.
అరుణాచల్ ప్రదేశ్ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సొంత రాష్ట్రం. వివేకానంద కేంద్ర విద్యాలయ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వచ్చిన కిరణ్ రిజిజు కు కజలాంగ్ గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామానికి ఎవరైనా ముఖ్య అతిథులు వచ్చినప్పుడు స్థానికులు సంగీత వాద్యాలు మోగిస్తూ జానపద గీతాలు ఆలపించడం సంప్రదాయం. ఈ సంప్రదాయంలో భాగంగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు రాకను పురస్కరించుకుని అసలుసిసలైన జానపద గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తుండగా... కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా డ్యాన్సు చేసి స్థానికులతో కలసి ఎంజాయ్ చేశారు. అంతే కాదు. సదరు వీడియోను తన అకౌంట్ నుంచి అందరికీ షేర్ చేశారు.
During my visit to beautiful Kazalang village to monitor the Vivekananda Kendra Vidyalaya Projects. This is traditional merrymaking of Sajolang people whenever guests visit their village. The original folk songs and dances are the ESSENCE of every community in Arunachal Pradesh. pic.twitter.com/TTxor4nQJF
— Kiren Rijiju (@KirenRijiju) September 29, 2021