వర్ని, బోధన్ లో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ర్యాలీ

వర్ని, బోధన్ లో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ర్యాలీ

వర్ని,వెలుగు :  జిల్లా సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు మండల కేంద్రంలో శుక్రవారం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వర్ని ఎస్సై మహేశ్​ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. వర్ని సుభాష్​చంద్రబోస్​ చౌరస్తా వద్ద యువకులు, విద్యార్థులు, పోలీసులు మానవహారంగా ఏర్పడ్డారు. మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్థాలపై ఎస్సై అవగాహన  కల్పించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు మ్యాట్రిక్స్​ హైస్కూల్, వివేకానంద హైస్కూల్, మల్లారెడ్డి హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

బోధన్​ పట్టణంలో..

బోధన్​,వెలుగు: బోధన్ పట్టణ పోలీసులు మాదకద్రవ్యాల నివారణపై ర్యాలీ నిర్వహించారు.  అంబేద్కర్​ చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభమై అనిల్​ టాకీస్ చౌరస్తా, కొత్తబస్టాండ్​ వరకు కొనసాగింది. పట్టణ సీఐ వెంకటనారాయణ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వాడినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత చెడు అలవాట్లకు లోనుకావద్దని సూచించారు. కార్యక్రమంలో విద్యావికాస్ డైరెక్టర్​ శ్రీనివాసరావు, ఎస్సై హబీబ్​ఖాన్​, ఆటో డ్రైవర్లు, యువకులు పాల్గొన్నారు.