
వర్ని,వెలుగు : జిల్లా సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు మండల కేంద్రంలో శుక్రవారం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వర్ని ఎస్సై మహేశ్ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. వర్ని సుభాష్చంద్రబోస్ చౌరస్తా వద్ద యువకులు, విద్యార్థులు, పోలీసులు మానవహారంగా ఏర్పడ్డారు. మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్థాలపై ఎస్సై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు మ్యాట్రిక్స్ హైస్కూల్, వివేకానంద హైస్కూల్, మల్లారెడ్డి హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బోధన్ పట్టణంలో..
బోధన్,వెలుగు: బోధన్ పట్టణ పోలీసులు మాదకద్రవ్యాల నివారణపై ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభమై అనిల్ టాకీస్ చౌరస్తా, కొత్తబస్టాండ్ వరకు కొనసాగింది. పట్టణ సీఐ వెంకటనారాయణ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వాడినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత చెడు అలవాట్లకు లోనుకావద్దని సూచించారు. కార్యక్రమంలో విద్యావికాస్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎస్సై హబీబ్ఖాన్, ఆటో డ్రైవర్లు, యువకులు పాల్గొన్నారు.