రాజకీయలకతీతంగా రాజన్న ఆలయాభివృద్ధి : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజకీయలకతీతంగా రాజన్న ఆలయాభివృద్ధి : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

విప్ ఆది శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు: రాజకీయాలకతీతంగా వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందామని ప్రభుత్వ విప్‌‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​అన్నారు. బుధవారం వేములవాడ అనువంశిక అర్చక ట్రస్ట్, బ్రాహ్మణ నిత్యాన్న సత్రం వారి ఆధ్వర్యంలో అభినవ విద్యా తీర్థ సదనం నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌‌ మాట్లాడుతూ రాజన్న క్షేత్రంలో బ్రాహ్మణుల కోసం వసతి గృహం ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు.

 ప్రభుత్వం తరఫున వసతి గృహ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తామన్నారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాజన్న ఆలయంలో 10 వేల మంది భోజనం చేసేలా అధునాతన అన్నదాన సత్రం నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో సత్రం గౌరవ​ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ,  డాక్టర్ మధు రాధాకిషన్, నరహరిశర్మ, మహేశ్‌‌, రాము, వెంకటేశం, లక్ష్మీరాజం, రాజు, నర్సయ్య, మల్లికార్జున్ పాల్గొన్నారు.