
వేములవాడ, వెలుగు: వేములవాడ పట్టణంలో మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు మూడో రోజు రోడ్ల విస్తరణ పనులు కొనసాగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులుభారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్, ఆర్అండ్బీ, రెవెన్యూ శాఖల పర్యవేక్షణలో విస్తరణ పనులు కొనసాగాయి. రాజన్న ఆలయ పరిసరాలలో 144 సెక్షన్ కొనసాగుతోంది. రోడ్ల విస్తరణ లో ఇప్పటికే 150 మందికి పైగా పరిహారం చెక్కులు తీసుకున్నారు. మరోవైపువిద్యుత్ సరఫరా నిలిపివేసి సిబ్బంది నిర్మాణాలను తొలగిస్తున్నారు.