రాజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం

రాజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శనివారం తెల్లవారుజామున నుంచే ఆలయ ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి, కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ ఈవో వినోద్​రెడ్డి పర్యవేక్షించారు. సుమారు 50 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. 

నాంది సినిమా డీవోపీ దంపతులు..

వేములవాడ రాజన్నను నాంది, ఉగ్రం సినిమాల డీవోపీ(డైరెక్షన్ ఆఫ్ ఫొటోగ్రఫీ) సిద్దార్థ్– ప్రియాంక వర్మ దంపతులు శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కోడె మొక్కు చెల్లించుకున్నారు.