అనర్హులకు పెన్షన్లు ఇస్తున్నారని ఎమ్మెల్యేను నిలదీశారు

అనర్హులకు పెన్షన్లు ఇస్తున్నారని ఎమ్మెల్యేను నిలదీశారు

మహబూబాబాద్ జిల్లా: అనర్హులకు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని డోర్నాకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ను నర్సింహులపేట గ్రామస్తులు నిలదీశారు. మహబూబాబాద్ జిల్లాలో లబ్ధిదారులకు పెన్షన్లు అందించి వెళ్తున్న ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. అసలైన లబ్దిదారులను వదిలేసి అనర్హులకు ఇచ్చారని జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అర్హులైన అందరికీ పెన్షన్ లు ఇవ్వాలని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అధికారులను అదేశించారు.