
గీతానంద్, మిత్రా శర్మ హీరో హీరోయిన్లుగా దయానంద్ తెరకెక్కించిన చిత్రం ‘వర్జిన్ బాయ్స్’.రాజా దరపునేని నిర్మించారు. శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్ ఇతర పాత్రలు పోషించారు. జులై 11న సినిమా విడుదల కానుంది.
బుధవారం ఈ చిత్రం నుంచి ‘దం దిగా దం’అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక యూత్ఫుల్ లవ్ స్టోరీ. సినిమా చూస్తున్నంతసేపు కాలేజీ రోజులు గుర్తొస్తాయి. స్మరణ్ సాయి ఆరు చక్కని పాటలతో పాటు అద్భుతమైన బీజీఎం ఇచ్చాడు. కచ్చితంగా సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’అని చెప్పాడు.
టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోందని, ఇప్పటికే సెన్సార్ పూర్తయిన ఈ చిత్రం ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల కానుందని నిర్మాతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నటీనటులు గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహన్, జెన్నీఫర్ పాల్గొన్నారు.