అక్టోబర్ 12న వైఎస్సార్​టీపీ స్టేట్ ​కమిటీ భేటీ

అక్టోబర్ 12న వైఎస్సార్​టీపీ స్టేట్ ​కమిటీ భేటీ

హైదరాబాద్, వెలుగు: వైఎస్సార్​టీపీ రాష్ర్ట కార్యవర్గ సమావేశం గురువారం లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల అధ్యక్షతన జరగనుంది. ఎన్నికల కార్యాచరణపై ఆమె పార్టీ నేతలతో చర్చించనున్నారు. కాంగ్రెస్ లో విలీనం, పొత్తు లేకపోవటంతో ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. 

అన్ని జిల్లాల నేతలు, ఎమ్మెల్యే టికెట్ ఆశావహులు ఈ మీటింగ్​లో పాల్గొనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోపై ఆరుగురి నేతలతో షర్మిల కమిటీ వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే విషయంపైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.