యాదాద్రి జిల్లాలో వ‌ల‌స కూలీకి పాజిటివ్

యాదాద్రి జిల్లాలో వ‌ల‌స కూలీకి పాజిటివ్

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా: యాదాద్రి జిల్లాలో క‌రోనా క‌ల‌క‌లం రేపుతుంది. మహారాష్ట్ర నుంచి మోటకొండూర్ వచ్చిన వలస కూలీకి కరోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింది. ఈనెల 10న మహారాష్ట్ర నుంచి స్వస్థలం మోటకొండూర్ వచ్చిన ఏడుగురు వలస కూలీలలో ఒకరికి కరోనా పాజిటివ్ వ‌చ్చింది. సోమ‌వారం ఉదయం కోవిడ్-19 పరీక్షల కోసం హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించగా.. మంగ‌ళ‌వారం రిపోర్ట్ లో పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తెలిపారు డాక్ట‌ర్లు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి మోటకొండూర్ కు చెందిన మ‌హిళ అని చెప్పారు.