ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలో 10 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలో 10 మంది మృతి

ఆనంద్: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనంద్ జిల్లా, తారాపూర్ గ్రామం వద్ద ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. వీరంతా ఒకే కుటంబానికి చెందినవారిగా తెలుస్తోంది. కారులో నుంచి మృత దేహాలను తీశామని, వారిని గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు.