వాషింగ్టన్: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అమెరికా అప్పు 40 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.3,320 లక్షల కోట్లు) దాటింది. గత ఐదు నెలల్లోనే రూ.95 లక్షల కోట్ల విలువైన రుణాలు తీసుకుందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ వెల్లడించింది.
ట్రెజరీ బాండ్ల రాబడులు దశాబ్దాల గరిష్ట స్థాయులను తాకడంతో వడ్డీ భారం తడిసి మోపెడు అవుతోంది. ఏటా రూ.83 లక్షల కోట్లు వడ్డీలకే వెళ్తోంది. అయితే, 40 ట్రిలియన్ డాలర్ల అప్పు సంక్షోభం కాదని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎకానమీ బలంగా ఉండటం, గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా డాలర్ హోదా కొనసాగుతుండటం వల్ల అమెరికాకు+ ఎక్కువ అప్పులు తీసుకునే సామర్థ్యం ఉందని చెబుతున్నారు.
అమెరికా ప్రత్యర్థి చైనాకు రూ.690.47 లక్షల కోట్ల అప్పు ఉండగా, ఇండియా అప్పును రూ.200.53 లక్షల కోట్లుగా అంచనా వేశారు. భారత ప్రభుత్వ జీడీపీ రుణ నిష్పత్తి 56.1 శాతం ఉంది.
