కరోనాతో 10 మంది మావోలు మృతి

కరోనాతో 10 మంది మావోలు మృతి

చత్తీస్ ఘడ్ లో మావోయిస్టులపై కరోనా పంజా విసిరింది. దంతేవాడ జిల్లా దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో సుమారు 100 మందికి పైగా మావోయిస్టులకు కరోనా సోకింది. వీరిలో సోమవారం 10 మంది మృతి చెందారని దంతేవాడ ఎస్పీ అభిషేక్ చెప్పారు. కరోనా, ఫుడ్ పాయిజనింగ్ తో బాధపడుతున్నారన్నారు. వారికి వైద్య సహాయం కోసం పోలీసులును సంప్రదిస్తే... వైద్య సహాయం అందిస్తామని చెప్పారు.