సికింద్రాబాద్ ​స్థానానికి 10 నామినేషన్లు

సికింద్రాబాద్ ​స్థానానికి 10 నామినేషన్లు

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ లోక్​సభ స్థానానికి శుక్రవారం ఆరు నామినేషన్లు అందాయి. బీజేపీ అభ్యర్థిగా గంగాపురం కిషన్ రెడ్డి నాలుగు సెట్లు, బీఆర్ఎస్ అభ్యర్థిగా తీగుళ్ల పద్మారావుగౌడ్ రెండు సెట్లు దాఖలు చేశారు. 

అలాగే సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా(కమ్యూనిస్టు) నుంచి ఆర్.గంగాధర, యుగ తులసి పార్టీ నుంచి కొలిశెట్టి శివకుమార్, సోషలిస్ట్ పార్టీ నుంచి బీరంగంటి సునీతరాణి, ఇండిపెండెంట్​గా చాలిక చంద్రశేఖర్ నామినేషన్ వేశారు.