కాల్పుల విరమణ కంచికేనా.. గల్ఫ్లో మరోసారి రెచ్చిపోయిన ఇరాన్.. కువైట్, బహ్రెయిన్లపై భీకర దాడులు..

కాల్పుల విరమణ కంచికేనా.. గల్ఫ్లో మరోసారి రెచ్చిపోయిన ఇరాన్.. కువైట్, బహ్రెయిన్లపై భీకర దాడులు..

సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఇరాన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతుందని ప్రపంచం భావిస్తున్న తరుణంలో మరోసారి గల్ఫ్ భగ్గుమన్నది. ఇరాన్ దాడులతో ఘోర విధ్వంసం మళ్లీ మొదలైంది. శనివారం (జూన్ 06) బ్రహ్రెయిన్, కువైట్ దేశాలపై ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడటంతో ఒక భయానక యుద్ధవాతావరణం ఏర్పడింది. 

కువైట్, బహ్రయెన్ టార్గెట్ గా ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైళ్లను విజయవంతంగా అడ్డుకున్నామని బహ్రెయిన్ ప్రభుత్వం పేర్కొంది. అదే విధంగా గల్ఫ్ సరిహద్దు దేశాలపై దాడులు ఆపేయాలని హెచ్చరించినట్లు బహ్రెయిన్ తెలిపింది. 

హార్బూజ్ జలసంధి వైపు ఇరాన్ పంపించిన మిస్సైళ్లు, డ్రోన్లను అడ్డున్నట్లు అమెరికా ప్రకటించి విషయం తెలిసిందే.అదే విధంగా ఇరాన్ తీర ప్రాంతంలోని రాడార్ సైట్లపై దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది.  ఈ వార్త వచ్చిన  తర్వాత గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడటం చర్చనీయాంశంగా మారింది. 

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ఇరాన్ మిస్సైళ్లను పడగొట్టే పనిలో ఉన్నామని కువైట్ మిలిటరీ ప్రకటించింది. 

ఒకవైపు సీజ్ ఫైర్, శాంతి చర్చలు అంటూ అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రస్తుత దాడి ఆందోళన కలిగించే అంశం. 

►ALSO READ | అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పటికీ జమ్మూ కశ్మీర్ భారత్‎లో అంతర్భాగమే: UNOలో పాకిస్తాన్‎కు ఇండియా కౌంటర్

ఇప్పటికే చర్చలు జరుగుతుండగా ఇజ్రాయెల్.. గాజాపై దాడులకు దిగటం చర్చలకు అఘాతం కలిగినట్లు ఇరాన్ పేర్కొంది. చర్చలు లేవు ఏమీ లేవు అన్నట్లుగా ఇరాన్ లైట్ తీసుకుంది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఒకవైపు యుద్ధం ఆపేందుకు, హార్మూజ్ తెరిపించేందుకు తాము ప్రయత్నం చేస్తుంటే.. ఇజ్రాయెల్ చర్యతో మళ్లీ మొదటికొచ్చిందని.. నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మళ్లీ చర్చలు మొదలువుతున్నట్లు పేర్కొన్నారు. 

ఈ పరిస్థితుల్లో ఇరాన్ రాడార్లు లక్ష్యంగా అమెరికా దాడులు చేయగా.. ఇదే అదనుగా ఇరాన్‌ గల్ఫ్ లో మరోసారి రెచ్చిపోయింది. బహ్రెయిన్, కువైట్ లాంటి దేశాలపై ఇరాన్ భీకర దాడి చేసింది.