చెట్లు నరికినందుకు పది వేల జరిమానా

చెట్లు నరికినందుకు పది వేల జరిమానా

సిద్దిపేట, వెలుగు:  హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను అనుమతి లేకుండా నరికిన వ్యక్తికి సిద్దిపేట మున్సిపల్ అధికారులు రూ.10 వేల ఫైన్ వేశారు. సిద్దిపేట మున్సిపాలిటీ మూడో వార్డులో ఏడేండ్ల కింద నాటిన 25 మొక్కలను బుధవారం తడకపల్లి యాదగిరి అనే వ్యక్తి నరికేశాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు యాదగిరికి రూ. పది వేల జరిమానాతో పాటు పర్యావరణానికి నష్టం కలిగించినందుకు పరిహారంగా మరో 25 మొక్కలను నాటి, వాటిని సంరక్షించాల్సిన బాధ్యతలను అప్పగించారు.