- ముందుకు వచ్చిన నాఫ్కో, డీపీ వరల్డ్, మలబార్, లులూ గ్రూప్
- మంత్రి కేటీఆర్తో భేటీ అయిన కంపెనీల ప్రతినిధులు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రూ.1,040 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయి. దుబాయ్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్మంగళవారం ఆయా సంస్థల ప్రతినిధులతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానించారు. యూఏఈకి చెందిన నాఫ్కో రాష్ట్రంలో రూ.700 కోట్ల పెట్టుబడి పెడుతామని తెలిపింది. రాష్ట్రంలోని నేషనల్అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్తో కలిసి ఫైర్సేఫ్టీ ట్రైనింగ్అకాడమీ ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ హామీ ఇచ్చింది. కేటీఆర్తో సమావేశమైన నాఫ్కో సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్.. ఇండియాకు సరిపడే స్థాయిలో ఫైర్సేఫ్టీ ఎక్విప్మెంట్ను తాము స్థాపించబోయే సంస్థ ద్వారా తయారు చేస్తామన్నారు.
సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసే ఆక్వా క్లస్టర్లో లులూ గ్రూప్ పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ సంస్థ చైర్మన్యూసుఫ్అలీతో కేటీఆర్సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ నుంచి ఏటా రూ.వెయ్యి కోట్ల ఆక్వా ఉత్పత్తులు సేకరిస్తామని తద్వారా 500 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని తెలిపారు. రాష్ట్రంలో రూ.215 కోట్ల పెట్టుబడి పెడతామని ప్రముఖ పోర్టు ఆపరేటర్డీపీ వరల్డ్తెలిపింది.
ఆ సంస్థ వర్కింగ్వైస్ప్రెసిడెంట్అనిల్ మెహతా దుబయిలో మంత్రి కేటీఆర్తో సమావేశయ్యారు. హైదరాబాద్లోని తమ ఇన్లాండ్కంటైనర్డిపో ఆపరేషన్కోసం రూ.165 కోట్లు పెట్టుబడి పెడతామని తెలిపారు. మేడ్చల్సమీపంలో 5 వేల ప్యాలెట్కెపాసిటీ గల కోల్డ్స్టోరేజీ వేర్హౌస్ను రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో రూ.125 కోట్లతో ఫర్నీచర్తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మలబార్గ్రూప్ముందకు వచ్చింది.