పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. నిమిషం కాదు.. 5 నిమిషాలు

పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. నిమిషం కాదు.. 5 నిమిషాలు

10 వ తరగతి విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త చెప్పింది.  కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిసం నిబంధన ఎత్తివేసింది.  పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు 5నిమిషాల గ్రేస్‌ ట్రైం ఇచ్చింది.  మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి.  పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు కాస్త టెన్షన్‌ లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఉదయం 9.30 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి. కొత్తగా సవరించిన సమయం ప్రకారం  విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు కేంద్రంలోకి అనుమతించనున్నారు.