మహారాష్ట్రలో పట్టాలు తప్పిన ఎల్‌టీటీ-జయ్‌నగర్‌ రైలు

మహారాష్ట్రలో పట్టాలు తప్పిన ఎల్‌టీటీ-జయ్‌నగర్‌ రైలు

నాసిక్: మహారాష్ట్రలో రైలు ప్రమాదం జరిగింది. లోక్ మాన్య తిలక్ టెర్మినల్ (ఎల్టీటీ)-జయ్ నగర్ పవన్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఆదివారం మధ్యాహ్నం 3.10 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 11  బోగీలు పట్టాలు తప్పాయి. అయితే.. లోకో పైలెట్ అప్రమత్తతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారమందుకున్న మెడికల్ రిలీఫ్ వ్యాన్లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. రైలు ప్రమాదంలో ఇద్దరికి స్పల్పంగా గాయాలయ్యాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం కారణంగా 7 రైళ్లను రద్దు చేసింది. మరో మూడు రైళ్లను దారి మళ్లించారు.

మరిన్ని వార్తల కోసం..

పంజాబ్ తో మ్యాచ్.. టాస్ గెలిచిన చెన్నై

ఢిల్లీకి బయల్దేరిన కేసీఆర్‌