శ్రీశైలం టెంపుల్​కు రూ. 11 కోట్ల బంగారు రథం

శ్రీశైలం టెంపుల్​కు రూ. 11 కోట్ల బంగారు రథం

శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం మల్లన్నకు నెల్లూరు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు  రూ.11 కోట్ల విలువ చేసే స్వర్ణరథాన్ని తయారు చేయించారు. శుక్రవారం దాన్ని మల్లన్నకు కానుకగా సమర్పించుకున్నారు. స్వర్ణ రథానికి  ఆలయ అర్చకులు, వేదపండితులు ఆలయ రాజగోపురం వద్ద సంప్రోక్షణ, పూజలు నిర్వహించారు. అనంతరం నంది గుడి వరకు స్వర్ణ రథోత్సవం జరిపారు.

రథంలో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, కుమారస్వామి, దిగువ భాగంలో బ్రహ్మమూర్తులు కొలువై ఉన్నారు. శ్రీశైల దేవస్థానంలో ఇప్పటి వరకు ప్రతి సోమవారం వెండి రథోత్సవం నిర్వహించేవారు. ఇకపై స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి పాల్గొన్నారు.