ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బలోడా బజార్- భటపరా రహదారిపై ట్రక్కు, పికప్ వ్యాన్ ఢీకొని 11 మంది మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక పికప్ వ్యాన్లో కొందరు వ్యక్తులు గురువారం రాత్రి ఒక ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తుండగా.. భటపరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమారియా గ్రామం వద్ద ఎదురుగా వచ్చిన ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో పికప్ వ్యాన్లో ఉన్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరిన పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని భటపరా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సిద్ధార్థ భఘేల్ తెలిపారు.