ముంబైలో గోడకూలి 12 మంది మృతి

ముంబైలో గోడకూలి 12 మంది మృతి

మహారాష్ట్ర రాజధాని ముంబై లో ఘోర ప్రమాదం జరిగింది. ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాలకు సోమవారం రాత్రి మలాడ్‌ ఈస్ట్‌ ప్రాంతంలో గోడ కూలింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా… 13 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని  ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.

మలాడ్ ఘటనపై సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందని ఈ ఉదయం ట్వీట్ చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.